కాదేది నాకు అసాధ్యమంటూ దూసుకుపోతున్న సెన్సెషనల్ పోలిటిషియన్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్కు షాక్ తగిలింది. కేఏ పాల్ రాజకీయ విమర్శలు చేస్తూ క్రైస్తవుల పరువు తీస్తున్నారు. ఈ వ్యాక్యలు చేసింది వేరే ఎవరో కాదు.. క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అక్కడితో ఆగలేదు.. రాజకీయ పార్టీలకు క్రైస్తవులను తాకట్టు పెట్టే ఆలోచనలను తాకట్టు పెట్టే ఆలోచనలను కట్టి పెట్టాలని.. తానో గొప్ప వాడినంటూ ప్రచారం చేసుకోవడం మానుకోవాలని సూచించింది.
ఉన్నదీ, లేనిదీ మాట్లాడుతూ క్రైస్తవుల పరువు తీయొద్దని.. క్రైస్తవ మతబోధకుడిగా ఉన్నప్పుడు ప్రధానులు, సీఎంలు, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారు వచ్చి నమస్కరించడానికి కారణం మత బోధకుడు అన్న హోదా మాత్రమే అని.. దానిని చులకన చేయవద్దని పాల్కు సూచించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా గురించి కానీ, రాజకీయ పార్టీలలో సీట్ల కోసం కానీ తాము ఏనాడూ అడగలేదన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఫ్రంట్ కన్వీనర్ జెరూసలెం మత్తయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చివరగా కేఏ పాల్కు వుంటే రాజకీయాల్లోను, లేదంటే మతబోధకుడిగాను ఉండాలని, రెండింటిలోనూ ఉండొద్దని సూచిస్తూ… రాజకీయాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొనవద్దని కోరారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే పాల్ను అడ్డుకోవాల్సి వస్తుందని అల్టిమేటర్ జారీ చేసింది క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.