జగన్ పాదయాత్ర ఎఫెక్ట్తో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసకుంటున్నాయి. జగన్కు వస్తున్న ప్రజాధరనను చూసి ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలు పార్టీ ఖండువా కప్పుకొనేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీ తీర్థం పుచ్కుకున్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీలను భాజాపా తుంగలోకి తొక్కిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇక భాజాపాలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని పలువురు రాష్ట్ర నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఏపీ భాజాపా అధ్యక్షరేసులో ఉన్న కన్నాకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనుకు కాకుండా మరోకరిని అధ్యక్షునిగా చేస్తుండంతో కన్నా గుర్రుగా ఉన్నారు. ఇక భాజాపాలో ఉంటే భవిష్యత్తు ఉండదని రేపు జగన్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకోగా ఆయన దారిలో మరో సీనియర్ నేత కావూరి సాంబశివరావు ఉన్నట్లు తెలుస్తోంది.
రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు కన్నా నిర్ణయించుకోగా ఆయన దారిలో సాంబశివరావు, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా పయనించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాటసాని ఈనెల 29న వైసీపీలో చేరుతారని తెలుస్తుండగా, కావూరి చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. సీనియర్ నాయకుల వలసలతో వైసీపీ మరింత పటిష్టంగా తయారవ్వనుంది.