కర్నాటకలో కాంగ్రెస్, భాజాపా నేతల మధ్య మాటల వార్ కొనసాగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే రాష్ట్ర సీఎంగా తాను మే 17న ప్రమాణ స్వీకారం చేస్తానని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 15న తాను ఢిల్లీ వెళ్లి 17న జరిగే తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తానని సంచలన ప్రకటన చేశారు.
224 మంది సభ్యులు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో తమ పార్టీ 145 నుంచి 150 స్ధానాలు గెలుపొందుతుందని యడ్యూరప్ప అంచనా వేశారు.తాను రాష్ట్రమంతా మూడుసార్లు చుట్టివచ్చానని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందనే పూర్తి విశ్వాసం తనకుందని ఆయన చెప్పుకొచ్చారు.
యడ్యూరప్ప వ్యాఖ్యలకు సీఎం సిద్ధారామయ్య కౌంటర్ ఇచ్చారు. ఆయనకు మతి భ్రమించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 120 స్ధానాలకు పైగా గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు ఇవాళ చరిత్ర సృష్టించేందుకు క్యూల్లో నిలబడి ఓట్లు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశానికి సుపరిపాలనతో కూడిన పురోగామి రాజకీయాలను చాటిచెపుతున్నారని అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
Today People of Karnataka are standing in queues to create history & show the nation the way to liberal, progressive, peaceful & compassionate politics & governance.
I thank them for their support & wish them well. https://t.co/XC662rENDI
— Siddaramaiah (@siddaramaiah) May 12, 2018