- Advertisement -

ఢిల్లీకి సిద్దూ-డీకే..ఏం జరుగుతోంది?

- Advertisement -

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు గర్భం దాల్చుతున్న నేపథ్యంలో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింతగా తీవ్రమయ్యాయి. సీఎం పదవికి సంబంధించి 2023లో సిద్ధరామయ్య–శివకుమార్‌ల మధ్య జరిగినట్లు ఒప్పందం జరిగిందన్న చర్చ తెరపైకి వచ్చింది.

ముఖ్యమంత్రి పదవి మార్పుపై పెరుగుతున్న ఒత్తిడి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వైపు నుంచి వస్తున్న దృష్ట్యా, పార్టీ హైకమాండ్ చివరకు వ్యవహారంలోకి దిగింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మధ్య కీలక సమావేశం ఢిల్లీలో జరగనుంది. నవంబర్ 29న సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించి సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రాహుల్ గాంధీతో సమావేశం అవకాశాన్ని శివకుమార్ అనుచరులు శుభ సూచకంగా చూస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పవర్-షేరింగ్ కమిట్‌మెంట్‌పై సిద్ధరామయ్యను ప్రశ్నించే అవకాశం వస్తుందని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ముందు ఎవరి వాదనలు బలంగా నిలిస్తాయో, వారికి పైచేయి ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఇక సిద్ధరామయ్య తన అనుచరులైన జీ పరమేశ్వర, సతీష్ జగ్తపాల్, మహాదేవప్ప, వెంకటేష్, రాజన్న వంటి నేతలతో సమావేశమై హైకమాండ్‌తో మాట్లాడే వ్యూహాన్ని సిద్ధం చేశారు.

సిద్ధరామయ్య వంటి బలమైన ఓబీసీ నేతను మార్చడం సులభం కాదని శివకుమార్ తెలుసుకుని, ఎమ్మెల్యేల వ్యక్తిగత మద్దతు కూడగట్టే పనిలో పడిపోయారు. శివకుమార్ సోదరుడు డీకే సురేష్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. చర్చించిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తెలియజేస్తాం అని ఖర్గే ప్రకటించారు.

ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య..పిలిస్తే నేను ఢిల్లీకి వెళ్తాను అని అన్నారు. శివకుమార్ కూడా, “పిలిస్తే మేమిద్దరం కలిసి వెళ్తాం,” అని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -