- Advertisement -
ఐపీఎల్ 14వ సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ తమ కొత్త జెర్సీని ప్రకటించింది. ప్రస్తుత జెర్సీ ఎరుపు రంగులో ఉండి అంచుల వెంట బంగారు వర్ణంలో చారలు ఉండేలా తయారు చేశారు. పంజాబ్ కింగ్స్ జెర్సీలో.. సింహం గుర్తు కింద కూడా ఉండే విధంగా డిజైన్ చేశారు.
జెర్సీకి తగ్గట్లే బంగారు వర్ణంలో ఉండే హెల్మెట్లను పంజాబ్ బ్యాట్స్మెన్లు ధరించనున్నారు. కాగా, పంజాబ్ తన తొలి మ్యాచ్ను వాంఖడే వేదికగా ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.
టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్ కరోనా బారినపడింది. ఈ విషయాన్ని ఆమె సమీప బంధువులు తెలియజేశారు. ప్రస్తుతం హర్మన్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఆమెకు కరోనా ఎలా వచ్చిందో అనేదానిపై స్పష్టత లేదని తెలిపారు.