Friday, May 17, 2024
- Advertisement -

బాబుకు అదిరిపోయే షాక్……. ఉత్త‌రాంధ్ర‌ జిల్లాల బలమైన నాయకుడు వైకాపాలోకి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ నాయకులు అందరికీ 2019ఎన్నికల రేసులో గెలుపు గుర్రం ఎవరో స్పష్టంగా తెలిసిపోతోంది. సర్వేలతో పాటు జనస్పందనలు కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా టిడిపికి పూర్తి పట్టున్న నియోజకవర్గాలుగా, చంద్రబాబు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలుగా పేరున్న చోట కూడా జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అలాగే టిడిపి సీనియర్ నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో మీడియాతో నిరాశాపూరితమైన మాటలు చెప్తూ ఉన్నారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర చాలా గట్టి ప్రభావమే చూపించేలా ఉందని నిజాలు ఒప్పుకుంటున్నారు.

ఇక చంద్రబాబును నమ్ముకుని టిడిపిలో చేరిన నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరుగా వైకాపాలో చేరడానికి రెడీ అవుతున్నారు. విజయసాయితో అందరూ టచ్‌లోకి వస్తున్నారు. తాజాగా గోదావరి జిల్లాలలో సీనియర్ నాయకుడిగా పేరుగాంచిన కొణతాల రామకృష్ణ గ్రూప్ నాయకులు అందరూ వైకాపాలో చేరడానికి ముహూర్తం చూసుకుంటున్నారు. కొణతాల అనుచరుల్లో ముఖ్య నాయకుడు అయిన గండి బాబ్జీ ఈ విషయాన్ని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతం విందు రాజకీయాలు చేస్తున్న గండి బాబ్జీ…..ఆ విందు కార్యక్రమాలు అన్నింటికీ కూడా కేవలం వైకాపా నాయకులను, వైకాపా జనాలను మాత్రమే ఆహ్వానిస్తున్నాడు. సొంత పార్టీ టిడిపి నాయకులు, కార్యకర్తలను పూర్తిగా దూరం పెట్టేస్తున్నాడు. ఇక్కడే అందరికీ విషయం అర్థమైపోయింది. ఇక కొణతాలతో సహా గ్రూప్ నాయకులందరూ కూడా వైఎస్ జగన్‌కి మద్దతిస్తూ వైకాపాలో చేరడానికి రెడీ అయిపోయారని గండి బాబ్జీ మీడియాకు చెప్తున్నాడు. 2014 ఎన్నికల్లో టిడిపి గెలుపును డిసైడ్ చేసింది గోదావరి జిల్లాలే అన్న మాట నిజం. అప్పట్లో గోదావరి జిల్లాల్లో అంతో ఇంతో పట్టున్న బిజెపితో పొత్తు, పవన్ కళ్యాణ్ మద్దతు….ఇలా చాలా అంశాలు కలిసొచ్చి బాబుకు మెజారిటీ సీట్లు వచ్చాయి. ఈ సారి మాత్రం చంద్రబాబుకు ఉన్న బలాలు అన్నీ బలహనీతలు అయిపోగా…… జగన్‌కి మాత్రం బలం పెరుగుతూ వస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు అందరూ కూడా వైకాపా వైపు చూస్తున్నట్టుగానే గోదావరి జిల్లాల నాయకులు కూడా జగన్‌కి మద్దతివ్వడానికి రెడీ అవుతున్నారు. కొణతాల రామకృష్ణను టిడిపిలో చేర్చుకోవడానికి చంద్రబాబు, లోకేష్‌లు చాలా ప్రయత్నాలే చేశారు కానీ కొణతాల మాత్రం నారావారిని నమ్మలేను అని చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ మాట ఇస్తే నిలబెట్టుకుంటాడని ….జగన్‌తో కలిసి నడవడమే మంచిదని చెప్పి అనుచర నాయకులు కూడా కొణతాలను ఒప్పించారు. జగన్ పాదయాత్ర రాజమండ్రికి చేరుకునే సమయానికి కొణతాలతో పాటు గ్రూప్ నాయకులు అందరూ కూడా వైకాపాలో చేరడం ఖాయమని గండి బాబ్జీ అనుచరులు బహిరంగంగానే చెప్పేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -