Sunday, May 5, 2024
- Advertisement -

కాంగ్ర‌స్ గూటికి చేరిన కొండా దంప‌తులు..

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి రాజీనామా చేసిన కొండా సురేఖ, మురళీ దంపతులు కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీీసీ కార్యాలయానికి చేరుకున్న వీరికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వరంగల్ ఈస్ట్ తో పాటు పరకాల అసెంబ్లీ టికెట్ విషయంలో టీఆర్ఎస్ అధిష్ఠానం స్పష్టత ఇవ్వకపోవడంతో కొండా దంపతులు పార్టీ మారారు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన కొండా దంపతులు.. 105 అభ్యర్థులను ప్రకటించి తమ పేరును మాత్రం పెండింగ్ లో పెట్టడాన్ని ప్రశ్నించారు. తమపై పార్టీ అధిష్ఠానం వివక్ష చూపుతోందన్నారు. కొండ దంపతులకు టికెట్ పై కేసీఆర్ మెత్తపడినా, కేటీఆర్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే వారు పార్టీలో చేరినట్టు సమాచారం. కొండా దంపతులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -