గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన బుట్టా రేణుక మళ్లీ సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యారు. గతంలో టీడీపీ ఆపరేషణ్ ఆకర్ష్లో భాగంగా తాయిలాలకు ఆశపడి టీడీపీలోకి ఫిరాయించారు. మరో సారి తమకే టికెట్టు ఇవ్వాలనే హామీతో బుట్టా పార్టీ ఫిరాయించారు. అవసరానికి ఉపయోగించుకున్న బుబు ఎంపీ టికెట్టు కాదు కదా కనీసం ఎమ్మెల్యే సీటులకూడా ఇవ్వకుండా మొండిచేయి చూపారు.
బాబు వాడకం ఎలా ఉంటాదో తెలుసుకున్న బుట్టా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిన ఆమె.. త్వరలోనే టీడీపీకి గుడ్బై చెప్పేందుకు సిద్దం అవుతున్నారు. ఇడుపులపాయకు వెళ్లి జగన్తో భేటీ కానున్నారు బుట్టా దంపతులు.టీడీపీని వీడి… తిరిగి వైసీపీలో చేరాలని బుట్టా కుటుంబ సభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
పార్టీ మారే సమంలో కర్నూలు నుంచి బుట్టారేణుక మరో సారి ఎంపీగా పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించారు. చివరకు రాజకీయ సమీకణాల్లో భాగంగా ఆటికెట్ కోట్లకుటుంబానికి కేటాయంచారు చంద్రబాబు. ఆదోనినుంచి పోటీ చేయాలని బాబు బుట్టాకు సూచించినా ఆమె తిరస్కరించారు. చేసేదిలేక ఇప్పుడు వైసీపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.