Tuesday, April 16, 2024
- Advertisement -

ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటాం: సీపీ సజ్జనార్

- Advertisement -

ఒక బాధ్యత గల రాజకీయ నేత అయి ఉండి పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కాగా,  మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు ఆవులను తరలిస్తున్న లారీని నిన్న రాత్రి రాజాసింగ్ పట్టుకున్నారు. చౌటుప్పల్ చెక్ పోస్టు దగ్గర లారీని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారులు స్పందించకపోతే తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -