వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంగళి కృష్ణ పేరు బాగా వినిపించేది. కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరుపున కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనె వారు. అతని అసలు పేరు దంతులూరి కృష్ణ. అయితే చివరికి ప్రత్యర్థి వర్గాలు, అనేక మీడియాలు కలసి మంగళి కృష్ణగా పేరు మార్చారు.
ఇన్నాల్లు రాజకీయాలకు దూరంగాఉన్న కృష్ణ తాజాగా తెరమీదకు వచ్చారు. కడప జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా అందులో మంగళికృష్ణ ఉండాల్సిందే. అప్పట్లో ప్రతిపక్షాలు, రాజశేఖర్రెడ్డి ప్రత్యర్థి వర్గాలు తన పై కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. తెలుగు తమ్ముళ్లు తనపై అనేక కేసులు బనాయించారని తెలిపారు. తాజగా జగన్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
తనకు , జగన్కు ఎటువంటి స్నేహసంబంధం లేదన్నారు. తన ఇంటి పక్కనె పులివేదుందులలో జగన్ ఇల్లు ఉండేదని అందుకే జగన్ తనకు మంచి స్నేహితుడని ప్రత్యర్థివర్గాలు రూమార్లు సృష్టించారన్నారు. జగన్తో ఎటువంటి పరిచయం లేదని వైఎస్ఆర్తో మంచి స్నేహ సంబంధాలు ఉండేవన్నారు. ముఖ్యంగా జగన్ తన తండ్రి వారసత్వ రాజకీయాల్లో దూసుకుపోతున్నారని తెలిపారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఖశ్చితంగా సీఎం అవుతారన్నారు. రాజకీయ పరిస్థితుల కారనంగా తనను అనేక కేసుల్లో ఇరుకించారని తెలిపారు. అందుకే జగన్కు దూరంగా ఉంటున్నాని…లేకుంటె ఆయనకు నావల్ల చెడ్డపేరు వస్తుందని తెలిపారు. హటాత్తుగా వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.