Thursday, May 2, 2024
- Advertisement -

మనిషికి మానవత్వం చాలా ముఖ్యం..!

- Advertisement -

5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, హ్యాండ్ శానిటైజర్ మరియు 2000 ఫేస్ మాస్క్ లు MLA గారికి అందజేసిన పుష్పిత్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొరత వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వైద్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యను తీసుకువచ్చారు,వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు పుష్పిత్ స్టీల్ యాజమాన్యంతో మాట్లాడి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, హ్యాండ్ శానిటైజర్ మరియు 2000 ఫేస్ మాస్క్ లు ప్రజల శ్రేయసు కొరకు అందజేయమని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పుష్పిత్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, హ్యాండ్ శానిటైజర్ మరియు 2000 ఫేస్ మాస్క్ లు ఇవ్వడం చాలా సంతోషకరం. ఇంకా ఏ సహాయం కావాలన్నా చేస్తామని తెలిపారు. మనిషికి మానవత్వం చాలా ముఖ్యం,మనం చనిపోతే డబ్బుతో పూడ్చరు మట్టితోనే పూడుస్తారు,చనిపోయినప్పుడు పదిమంది మట్టి మన మీద వెయ్యాలంటే ప్రజాసేవ చేయాల్సిందే. దాతలు అందరూ ముందుకు వచ్చి ఇలాగే సహాయం చేయాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఏ వైద్యం చేసుకోవాలన్న మన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేయనున్నాము.

మన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం జగనన్న దాదాపు 12 కోట్ల రూపాయలు ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. మనిషికి మనిషే సహాయపడాలని గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే యువతకి చాలా భవిష్యత్తు ఉంది దయచేసి అనవసరంగా బయటకు వచ్చి బైకులుపై తిరగడం రోడ్లపై వెళ్లడం చేసి మీ బంగారు భవిష్యత్తు పోగొట్టకండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఏ సమస్య వచ్చినా వెంటనే తనకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో పుష్పిత్ స్టీల్ సంస్థ యాజమాన్యం మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -