పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్లో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే చేరికకు రంగం సిద్దమైంది.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్లో చేరికకు సుముఖత వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి రెండు రోజుల్లో కాంగ్రెస్లో చేరనున్నట్లు వెల్లడించారు.
నిన్న కేసీఆర్ తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి షాక్ ఇవ్వగా బీఆర్ఎస్ నుండి మాత్రం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కారు దిగి హస్తాన్ని అందుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది.