జగన్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసే తెలుగుదేశం పెద్దలరా.. బీజేపీ ప్రముఖులరా.. ఏడవకం ఏడవకండి. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న జగన్ క్రేజ్ ను చూసి ఏడవకండి. అవును ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు అందరూ ఆనందంగా ఉన్నారని దేశమంతా గుర్తిస్తోంది. ప్రముఖులు ఎందరో ఏపీ ప్రభుత్వాని ప్రశంసిస్తున్నారు.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జగన్ చేస్తున్న కృషిని కొనియాడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాలు ఏపీ ని ఆదర్శంగా తీసుకుంటాయి అని ఆశిస్తున్నాను అంటూ సాక్షాత్తూ ప్రధాని అనడం మామూలు విషయం కాదు. తిరుమల పర్యటనలో ఉన్న సీఎం జగన్ అక్కడి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కోవిడ్ నియంత్రన చర్యలకు సంబంధించి ఏడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మీరు అమలు చేస్తున్న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలకు సేవలు అందుతున్నాయి.
ఇదే విధానాన్ని మిగితా రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నాను అని మోడీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నియంత్రలకు సంబంధించి సీఎం జగన్ వివవరిస్తున్న క్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయింద అన్న సంతోషం కలుగుతుంది అన్నారు. సీఎం జగన్ వెనుక శ్రీవారి పెద్ద చిత్రపటం ఉండటంతో ప్రధాని ఈ విధంగా స్పందించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం అభినందనీయమని జగన్ ను మోడీ అభినందించారు. మోడీ గతంలోను ఈ తరహా ప్రశంసలతో జగన్ ను అభినందించారు. మోడే కాదు సినీ రాజకీయ ప్రముఖులు ఎందరో పలు సందర్భాల్లో జగన్ కార్యక్రమాలకు ప్రశంసలు అందించారు.
ఢిల్లీకి వెళ్లకముందే.. మోడీ నుంచి జగన్ కు గుడ్ న్యూస్..!
వైసీపీ లో ముసలం.. అంబటి రాంబాబు పై వ్యతిరేకత..?