Saturday, April 27, 2024
- Advertisement -

ఢిల్లీకి వెళ్లకముందే.. మోడీ నుంచి జగన్ కు గుడ్ న్యూస్..!

- Advertisement -

ఏపీ సీఎం వైయస్ జగన్ ఇంకా ఢిల్లీకి వెళ్లాలని లేదు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. జగన్ సర్కార్ కు కేంద్రం తీపి కబుర్లు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు కేంద్రం ఓకే చెప్పేసింది. నిజానికి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. చాలా ఏళ్ళ కింద ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రాలేదు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో ప్రాజెక్టును చేపడుతుంది. జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కూడా నిధులు రావాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రూపాయి రాలేదు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఏపీ సీఎం వైయస్ జగన్ వైసీపీ ఎంపీలు మంత్రులు పోలవరం నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు.

తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల్లో 2300 కోట్లు రియంబస్ చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ సంతకం పెట్టి ఫైల్ ను ఆర్ధిక శాఖకు పంపించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా బహిరంగ మార్కెట్లో బాండ్ల ద్వారా రుణాలను సేకరించి ఏపీ ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో ఓ వారంలోపు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు రానున్నాయి.

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసిపి ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిపాదించిన 2300 కోట్లను విడుదల చేయడంతో పాటు మిగిలిన నిధులు 1758 కోట్లను మరో విడుతలో విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రానికి రావాల్సిన నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరిగితే మాత్రం చరిత్ర సృష్టించొచ్చు..?

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఇలా వరం అయిపోతుంది..?

తెలంగాణ లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్ ఎలా స్పందిస్తారో..?

ట్రాన్స్ జెండర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -