Tuesday, May 14, 2024
- Advertisement -

వోకల్​ ఫర్ లోకల్ పేరుతో మోదీ మళ్లీ మొదలు..!

- Advertisement -

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్’ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. మహాత్ముడు దండి యాత్రను మొదలుపెట్టిన సబర్మతీ ఆశ్రమం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

ఆత్మనిర్భరత్​ పట్ల భారతీయుల్లో మరింత స్ఫూర్తిని రగిలించడంలో దండియాత్ర కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ‘వోకల్​ ఫర్ లోకల్​’ నినాదంతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మహాత్మునితో పాటు స్వాతంత్ర్య సమర యోధులకు ఘన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేయాలని మోదీ కోరారు. సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాటు చేసే చరఖాలో ఆత్మనిర్భరతకు సంబంధించిన ట్వీట్లను జోడించనున్నట్లు చెప్పారు. ఇది ప్రజల ఉద్యమానికి హేతువుగా నిలుస్తుందన్నారు.

మెరిసే ముఖ సౌంద‌ర్యం కోసం.. ఈ చిట్కాలు !

హైదరాబాద్ లో జలకన్య ఆకారంలో వింత శిశువు జననం!

చెర్రీ సరసన మరోసారి బాలీవుడ్ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -