Wednesday, May 8, 2024
- Advertisement -

నార‌దుడి వేషంలో ఎంపీ శివప్రసాద్ నిర‌స‌న‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌నే నినాదంతో పోరాటం చేస్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎంపీలు. వైఎస్సార్‌సీపీ ఏపీలో, ఢిలీలో రోజు పోరాటం చేస్తుండ‌గా వీరికి పోటీగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా నిర‌స‌న‌లు చేస్తున్నారు. అయితే టీడీపీ ఎంపీల్లో చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ విభిన్నంగా నిర‌స‌న తెలుపుతున్నాడు.

ఎప్పుడూ ఏం చెప్పినా విభిన్నంగా నిర‌స‌న‌లు తెలుపుతారు శివ‌ప్ర‌సాద్‌. బుధ‌వారం పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. నారదుడు వేషధారణలో పార్లమెంట్‌కు ఎంపీ శివప్రసాద్ వ‌చ్చారు. ‘వింటేనే ఉంటారు మోదీ’ అంటూ పద్యం పాడుతూ త‌న‌దైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. విభజన చేయవద్దు అని సోనియగాంధీకి చెప్పిన ఏమైంది? అంటూ ప్రశ్నిస్తూ నిర‌స‌న తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -