ఏపీ రాజకీయాల్లో నేతలు ఇతర పార్టీలల్లో చేరుతున్నారనె వార్తలు ఊపందుకున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరుతారనె ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలపై కిషోర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
కార్యకర్తలతో సమావేశ మయిన కిషోర్ ఏపార్టీలోను ప్రస్తుతం చేరడంలేదని వెల్లడించారు. తాను కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని చెప్పారు. తన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్లు నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినా ఓటర్లు గుర్తించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు కిషోర్ కుమార్ రెడ్డి చెప్పారు.
నేను, కిరణ్ రెడ్డి ఒకే పార్టీలో అన్ని మండలాల్లో పర్యటించి కార్యకర్తల అభిప్రాయం మేరకు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని కిషోర్ కుమార్ రెడ్డి చెప్పారు. కొంతమంది తన సోదరుడు కిరణ్ రెడ్డి, తాను మరో పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రసక్తే లేదన్నారు.