Friday, May 10, 2024
- Advertisement -

అల్లుడు కోసం మామ త్యాగం చేస్తాడా?

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల‌లో చిన‌బాబు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల రంగంలోకి దూకుతాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.చంద్ర‌బాబుకు ప‌రిపాలన క‌న్నా త‌న కొడుకుని నాయ‌కుడిగా నిల‌బెట్టడానికే ఎక్కువుగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లుంది.అయితే చిన‌బాబుకు అనువైన సీటు కోసం వేతికే ప‌నిలో ప‌డ్డారు టీడీపీ నాయ‌కులు.నారా లోకేష్‌ని వ‌చ్చే ఎన్నిక‌ల‌లో చిత్తూరు జిల్లా నుండి పోటీ చేయించాల‌ని ఆ జిల్లా టీడీపీ నాయ‌కులు భావిస్తున్నారు.

లోకేష్ ఇప్ప‌టికే త‌న‌కు అనువుగా ఉండే రెండు, మూడు నియోజిక వ‌ర్గాల‌ను ఎంపిక చేస్తుకున‌ట్లు తెలుస్తుంది.త‌న తండ్రి పోటీ చేసిన కుప్పం నియోజిక వ‌ర్గం నుండి పోటీ చేయల‌ని లోకేష్ ఆలోచ‌న‌.అయితే అక్క‌డి నుండి పోటీ చేస్తే మెజారిటీ త‌గ్గుతుంద‌ని కొన్ని సర్వేల ద్వారా తెలుసుకున్న లోకేష్ కుప్పం నుండి పోటీ చేయ‌ల‌నే ఆలోచ‌న‌ను విర‌మించ‌కున్నార‌ని స‌మాచారం.ఇక లోకేష్ కోసం టీడీపీకి కంచుకోట అయిన హిందుపురం అయితే బాగుంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు.అక్క‌డి నుండి అయితే లోకేష్ తేలిక‌గా గెలుస్తార‌ని, మెజారిటీ కూడా బాగానే వ‌స్తుంద‌ని టీడీపీ నాయ‌కుల ఆలోచ‌న‌.

మ‌రి దీనిపై బాల‌కృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.ఎందుకంటే బాల‌కృష్ణ 2014లో హిందుపురం నుండి పోటీ చేసి గెలిచిన సంగ‌తి తెలిసిందే.బాల‌కృష్ణ త‌న సీటును అల్లుడు కోసం త్యాగం చేస్తాడో లేక సినిమాల‌లో లాగా టెంప‌ర్ లేచ్చిద్ది అని అంటారో చూడాలి.చూద్దాం చిన‌బాబు క‌థ చివ‌రికి ఎక్క‌డి చేరుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -