Sunday, May 19, 2024
- Advertisement -

సీమకు ఏమీ చేకపోయినా పర్లేదు…… ఇలాంటి మాటలతో మాత్రం ఎటకారం చెయ్యొద్దు లోకేష్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సొంత కుటుంబ ఆస్తిలా చంద్రబాబు, లోకేష్‌లు భావిస్తున్నారన్నది నిజం. గెలిపించి అధికారాన్ని ఇచ్చారు కాబట్టి అధికారంలో ఉన్నంత కాలం మేం ఏం మాట్లాడితే అది వినాలని…. ఏం చేస్తే దాన్ని గౌరవించాలని భావిస్తున్నట్టున్నారు. ఇక పెన్షన్లు, రోడ్లతో సహా అన్ని పనులూ సొంత కష్టార్జితాన్ని ఖర్చుచేసినట్టుగా చెప్తారు బాబుగారు. జీవితాంతం ఓటర్లందరూ నారావారికి బానిసలుగా ఉండాలి అన్న స్థాయిలో చెప్తారు. నాలుగేళ్ళలో రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్‌కి ఆయన చేసింది ఏంటి అంటే మాత్రం ఇదమిత్థంగా ఏమీ చెప్పలేరు నారావారు.

ఇక ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు? కోడలు మగబిడ్డకంటానంటే అత్త వద్దంటదా? లాంటి మాటలతో తన స్థాయి నిరూపించుకున్నాడు బాబు. ఇక ఇప్పుడు తాజాగా లోకేష్ కూడా అంతకంటే దారుణంగా కర్నూలు ప్రజలను అవమానించాడు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రేసులో ఉన్నది. కానీ బాబుగారు మాత్రం విజయవాడ ఫిక్స్ అయి కర్నూలును సైడ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కర్నూలు పనికిరాదని తేల్చేశారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన కుమార రత్నం లోకేష్ బాబు అంతకంటే ఎక్కువ ఎటకారం చేశాడు. కర్నూలును భారతదేశానికి రెండో రాజధాని చేయాలట. కామెడీకే చెప్పాడో…… ఎటకారం చేశాడో కానీ కర్నూలు వాసులు మాత్రం లోకేష్ బాబుకు అధికార అహంకారం నెత్తికెక్కిందా అని ప్రశ్నిస్తున్నారు. కడప రౌడీలు, సీమ రౌడీలు అంటూ చంద్రబాబు చాలా సార్లు సీమను అవమానించాడు. ఇప్పుడు దేశానికి రెండో రాజధానిగా కర్నూలును చెయ్యాలి అంటూ ఎటకారంగా మాట్లాడడం మాత్రం అంతకుమించి అనే స్థాయిలో సీమవాసులను బాధించేలా ఉంది. అధికారం ఉంది…… నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడినా ఆ మాటలు అద్భుతం అని మేనేజ్ చేసే మీడియా ఉంది అని అనుకుంటున్నారో ఏమోకానీ చంద్రబాబు, లోకేష్‌లు మాత్రం ఓటేసి గెలిపించి……అధికారం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లను మాత్రం దారుణంగా అవమానిస్తున్నారని సీనియర్ జర్నలిస్టులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నపరిస్థితి. అధికారంలో ఉన్నవాళ్ళకు వినిపిస్తుందంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -