Monday, April 29, 2024
- Advertisement -

పవన్ స్కెచ్ లు జగన్ కు చుక్కలు !

- Advertisement -

ప్రభుత్వ టార్గెట్ గా పవన్ చేపడుతున్న విధానాలు, అనుసరిస్తున్న వ్యూహాలు వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని కంకణం కట్టుకున్న జనసేనాని.. ఆదిశగా వెస్తోన్న ప్రతి అడుగు సక్సస్ అవుతోంది. దాంతో జనసేనాని అనుసరిస్తున్న వ్యూహాలు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ మద్య రోడ్ల విషయంలో జనసేన చేపట్టిన ” గుడ్ మార్నింగ్ సి‌ఎం సార్ ” సోషల్ మీడియా క్యాంపైన్ కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనే విషయాన్ని ఆ ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు జనసైనికులు. దాంతో రోడ్ల విషయంలో జగన్ ప్రభుత్వంపై సామాన్యుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక జనవాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం గుర్తించని ఎన్నో సమస్యలను తెరపైకి తెచ్చారు పవన్. .

దీంతో జనసేన పార్టీ పై ప్రజల్లో ఒక సానుకూలత ఏర్పడడంతో పాటు జగన్ సర్కార్ పై అంతే స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతూ వచ్చింది. దీంతో ప్రభుత్వ టార్గెట్ గా పవన్ చేపడుతున్న ప్రతి పని.. వైసీపీని చిక్కుల్లోకి నేడుతోంది. కాగా జనసేనకు బ్రేకులు వేసేందుకు వైసీపీ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. ఆ మద్య జరిగిన విశాఖ ఘటన, ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఇప్పటం గ్రామ సమస్య.. ఇవన్నీ కూడా జనసేన కు ప్లేస్ అవుతూ పార్టీకి మంచి మైలేజ్ తెస్తుండడంతో.. వైసీపీ నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇక ఇప్పుడు జననన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అంటూ మరో కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు పవన్.

జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” జగనన్న కాలనీలలోని అవకతవకలను, సదుపాయాలలో జరుగుతున్నా లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు జనసేనాని. ఇది వైసీపీకి ఏమాత్రం మింగుడు పడని విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రోడ్ల విషయంలోనూ, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను చాలా బలంగా బయటపెట్టిన జనసేనాని.. ఈసారి ” జగనన్న ఇల్లు .. పేదలందరికి కన్నీళ్లు ” ఎలాంటి సమస్యలు తెరపైకి తెస్తాడో అని, వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక జగనన్న ఇల్లు పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకులాం చేరుకున్న పవన్ కు అక్కడి ప్రజానీకం పెద్ద ఎత్తున నీరాజనం పలికింది. మొత్తానికి పవన్ చేపడుతున్న కార్యక్రమాలు వైసీపీకి గట్టి షాక్ ఇస్తున్నాయనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మోడీ ఇచ్చిన షాక్.. కే‌సి‌ఆర్ అసలు ఊహించలేదా ?

కుప్పంలో జగన్.. పులివెందులలో బాబు.. నిలిచి గెలిచేదెవ్వరు ?

తెలంగాణ జోలికొస్తే తాట తీస్తా.. మోడి ఫ్రస్టేషన్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -