Wednesday, April 24, 2024
- Advertisement -

అధికార పార్టీ ఎమ్మెల్యేకు భారీ షాక్‌!

- Advertisement -

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్‌కు నాన్‌బెయ‌ల‌బుల్ వారెంట్ జారీ అయింది. ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు ఈరోజు ఈ వారెంట్ ఇష్యూ చేసింది. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తూ ఎనిమిదేళ్ల క్రితం కాజీపేట రైల్వే స్టేష‌న్కు ద‌గ్గ‌ర‌లో చేసిన ఆందోళ‌న‌లో విన‌య్ భాస్క‌ర్ పాల్గొన్నారు.

దీంతో ఆయ‌న‌తో పాటు నిర‌స‌న చేసిన మ‌రో ఎనిమిది మంది తెలంగాణ ఉద్య‌మ కారుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇందుకు సంబంధించి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ప‌లువురు వ‌రంగ‌ల్ నేత‌లు విచార‌ణ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసు విష‌యంలో విన‌య్ భాస్క‌ర్ ఒక్క‌సారి కూడా న్యాయ‌స్థానం ఎదుట హాజరుకాలేదు.

దీంతో ఆయ‌న‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేస్తూ ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. ‌గ‌తంలో విన‌య్ భాస్క‌ర్‌తో పాటు మ‌రో నేత‌పై ఎన్‌బీడ‌బ్ల్యూ కూడా జారీ చేసింది. విన‌య్ భాస్క‌ర్ ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న విష‌యం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

‘కార్తీక దీపం’ వంటలక్క గురించి షాకింగ్ నిజాలు..!

సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -