Sunday, April 28, 2024
- Advertisement -

నోరు జారిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆపై క్షమాపణలు

- Advertisement -

రాముడి పేరిట బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారుచేసి చందాలు వసూలు చేస్తున్నారని
వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి నోరుజారి ఇబ్బందులను కొని తెచ్చుకున్నారు. హనుమకొండలో ఆదివారం జరిగిన ఓసి జేఏసీ సభలో కొన్ని కులాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘ఆ కులం అధికారులకు అక్షరం ముక్కరాదు.. ఎక్కడ చూసినా వాళ్లే.. మొత్తం నాశనం చేస్తున్నారు’ అంటూ కొన్ని కులాలను ఉద్దేశించి ఆయన మాట్లాడడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను సోమవారం దహనం చేశాయి. కుల సంఘాల ఆగ్రహంతో ఎమ్మెల్యే దిగి వచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, ఒకవేళ ఎవరి మనోభావాలను అయినా గాయపరచి వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత ఆదివారం రామమందిర నిర్మాణానికి చందాల విషయంలో ధర్మారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆయన నివాసం పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయ పొరుతో వరంగల్ అట్టుడికిపోయింది.

అదే జరిగితే దేశం రెండు ముక్కలవ్వడం ఖాయం

అక్క‌డైతే లీట‌రు పెట్రోల్ ధ‌ర 53 రూపాయ‌లే!

గందరగోళం సృష్టించండి. అధికారులను భయపెట్టండి

‘ఆదిపురుష్’పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్రభాస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -