తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్ దానికి దగినట్లుగానే ప్రచారంలో దూసుకుపోతున్నారు.టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా పెట్టిన మహకూటమి ఇంకా సీట్ల సర్దుబాటులోనే ఉన్నాయి.అయితే కేసీఆర్ తన రాజకీయ చతురతను బయటి తీశారు.నటుడు ,జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడం లేదని దాదాపు స్పష్టం కావడంతో ,పవన్ను తనపైపు తిప్పుకునే పనిలో పడ్డారు కేసీఆర్.దీనిలో భాగంగానే కేసీఆర్ .పవన్కు ఫోన్ చేసి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ కాల్ సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం.పవన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
పవన్ పూర్తిగా ఏపీ రాజకీయలపై దృష్టి పెట్టడంతో ,తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడం లేదు.దీంతో తెలంగాణలో జనసేన క్యాడర్ నిరుత్సాహంతో ఉంది.పవన్ను తనకు మద్దతు తెలిపితే జనసేన ఓట్లు అన్ని టీఆర్ఎస్కు పడతాయాని కేసీఆర్ ఆలోచన.దీనిపై పవన్కు ఫోన్ కేసీఆర్కు అటు నుంచి సానుకుల స్పందనే వచ్చిందని తెలుస్తుంది.తెలంగాణను అభివృద్ఙి చేసిన కేసీఆర్కు తమ పార్టీ మద్దతు ఉంటుందని పవన్ తెలిపారని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే కేసీఆర్కు తిరుగులేని మెజార్టీతో గెలుస్తారని తెలంగాణ జనసేన క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తుంది.