Sunday, May 12, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై బాధ‌ప‌డ్డ చిరంజీవి

- Advertisement -

జనసేన పార్టీ అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఒక‌ ప్రకటనపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌యిన‌ట్లు తెలుస్తోంది.ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య ప‌రిస్కారంకోసం బాబుతో బేటీ అయిన త‌ర్వాత ప‌వ‌న్ ప్ర‌సంగించిన సంగ‌తి వెలిసిందే.

ఇప్పటికే క్షేత్రస్థాయిలో తెలంగాణాలో జనసే సైనికుల ఎంపిక పూర్తైందని.,..ఏపీలో మరో రెండు జిల్లాలు మిగిలి ఉన్నాయని ఆ తరువాత ప్రజల్లోకి వెళ్తానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అప్పటి నుంచి ఆయన సినిమాలను పక్కన పెట్టనున్నారు. వారంలో మూడు రోజులు రాజకీయాలకు సమయం కేటాయిస్తానని చెప్పారు. రాజ‌కీయ పార్టీ పెట్టి చివ‌రికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయో చిరంజీవికి తెలుసు.అలాంటి త‌ప్పేతమ్ముడు చేయ‌కూడ‌ద‌ని స‌ల‌హా ఇచ్చారు.రాజకీయాలు తాను కూడా చూశానని, అయితే రాజకీయాల్లో ఉండాలో? వద్దో? చెప్పను కానీ… ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి ఓ సలహా ఇచ్చారని కూడా ప్రచారం సాగుతోంది.

రాజకీయాలు తాను కూడా చూశానని, అయితే రాజకీయాల్లో ఉండాలో, వద్దో తాను చెప్పనని, కానీ సినిమాలు మాత్రం మానుకోవద్దని తమ్ముడికి అన్నయ్య సలహా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.ఎంత కష్టమైనా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొమ్మని సలహా ఇచ్చారట. అంతే తప్ప సినిమాలు మానేస్తానని మాత్రం చెప్పవద్దని సూచించారట. తాను కూడా ఒకప్పుడు అలాగే ఆలోచించానని, ఇప్పుడు అది తప్పు అనిపిస్తోందని ఆయన తెలిపినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -