Saturday, May 4, 2024
- Advertisement -

పిచ్చి పిచ్చి నిర్ణ‌యాలు తీసుకుంటే తోలుతీస్తారు..బాబుకు ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్

- Advertisement -

ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప‌రిపాల‌న‌లో పిచ్చి పిచ్చి నిర్ణ‌యాలు తీసుకుంటే తోలు తీస్తాన‌ని హెచ్చ‌రించారు. రాజ‌ధాని పేరుతో అడ్డ‌గోలుగా ఇంకా భూములు సేక‌రిస్తే ఊరుకోమ‌న్నారు. నాడు రాజధాని భూసేకరణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడినప్పుడు 1850 ఎకరాల్లోనే రాజధాని అన్నారని.. అది కూడా అటవీ ప్రాంతంలోనే తీసుకోవాలని చర్చకు వచ్చిందని కానీ నేడు రాజధాని లక్ష ఎకరాలకు చేరిందని అన్నారు.

ఓ ఎమ్మెల్యే మహిళా అధికారిణి కొట్టినా చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేలు రేపు మంత్రులు కూడా అవుతారని, ఇటువంటి వ్యవస్థను తప్పుబట్టాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నీరు కలుషితమైందని, పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదని, గోదావరి జిల్లాలో నదీజలాలు కూడా కలుషితమయ్యాయని అన్నారు.

అడ్డగోలుగా భూ సేకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని, పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటే రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని పవన్ హెచ్చరించారు. ‘కేసులు పెడితే ఎదురు తిరగండి, అండగా నేనుంటా’ అంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తానని, ఇప్పుడు మాత్రం ఉద్యమాలు చేస్తానని స్పష్టం చేశారు.

బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా లేదంటే అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.. ప్రజలు తోలు తీస్తారని.. గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తనను డబ్బుతో కొనలేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -