Saturday, May 4, 2024
- Advertisement -

శంషాబాద్ విమానాశ్ర‌యంలో జైపాల్‌రెడ్డికి చేదు అనుభ‌వం ..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీకీ స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన ఆయ‌న‌ను శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆయనను పోలీసులు అనుమతించలేదు. కేవలం పది మంది సీనియర్ నేతలకు మాత్రమే పోలీసులు అనుమతించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు. ఆ సమయంలో రాహుల్ గాందీకి స్వాగతం పలికేందుకు వెళ్లిన జైపాల్ రెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పోలీసులకు ఇచ్చిన జాబితాలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు లేక‌పోవ‌డంతో విమానాశ్ర‌యంలోకి అనుమ‌తించ‌లేదు.

దీంతో జైపాల్ రెడ్డిని పోలీసులు శంషాబాద్ ఎయి‌ర్‌పోర్టు వెలుపలే నిలిపివేశారు. విఐపీ టెర్మినల్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలను నిలిపివేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబితాలో జైపాల్ రెడ్డి పేరును తెలంగాణ రాష్ట్ర శాఖ ఎందుకు చేర్చలేదనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జైపాల్ రెడ్డి పేరును ఉద్దేశ్యపూర్వకంగానే చేర్చలేదా.. లేక పొరపాటు జరిగిందా అనే చర్చ సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -