కాంగ్రెస్లో వర్గపోరు కొనసాగుతోందా.. ఇందిరాపార్క్ వేదికగా ఒక్కటైన నేతలు బయటికి మాత్రమే ఆవిధంగా కన్పించారా.. ఎంపీ కోమటిరెడ్డి వారి వద్ద డబ్బులు తీసుకున్నాడా.. ఇద్దరు ఎంపీల మధ్య వర్గ పోరు తెలంగాణ కాంగ్రెస్ను ఎటు తీసుకెళ్తుంది.
రమణ టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీడీపీ ఎలా ఉండేదో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే విధంగా ఉంది. కాంగ్రెస్లో ప్రస్తుత టీపీసీసీ ఛీప్ చేరిన కానుంచి ఆ పార్టీలో వర్గ పోరు మరింత ఎక్కువైందనే ప్రచారం సాగుతోంది. పార్టీలో ముగ్గురు కీలక నేతల వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణ చేసుకుంటూ.. అధికార పార్టీ చేస్తున్న తప్పులను మర్చిపోయింది. వారి మధ్యే ముసుగుల గుద్దులాట నడస్తోంది
గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ రెడ్డ్ హ్యండెట్గా పట్టబడ్డారు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికార పార్టీని పల్లెత్తు మాట కూడా అనటంలేదని, తన జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఎన్ని తప్పుడు పనులు చేసినా అయన వారి తప్పులను బయట పెట్టడంలేదనే టాక్ వినిపిస్తుంది. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ వద్ద డబ్బులు తీసుకున్నాడని, అందుకే అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నించడంలేదని రేవంత్ రెడ్డి వర్గం ఆరోపణలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
డబ్బులు ఇస్తేనే డోర్లు ఓపెన్ చేస్తాం!