ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేశారా.. తీన్మార్ టీమ్కు బీఎస్పీ తీర్థం విప్పిస్తున్నారా… మల్లన్న మోసం చేశారు. రండి మా పార్టీలో చేరండీ అంటూ తీన్మార్ అనుచరులకు ఏందుకు గాలెం వేస్తున్నారు.. అస్సలు మల్లన్న చేసిన మోసం ఏంటీ
తెలంగాణలో బహుజన సమాజ్ వాద్ పార్టీ విస్తరనే ధ్వేయమంటూ తన ఐపీఎస్ పాలనను వదిలిలేసిన ప్రవీణ్ కుమార్ తన రాజకీయ పునాదికి బలం పెంచుకుంటున్నారు. బహుజన వర్గాలను ఏకం చేస్తానంటూ ఏనుగు ఎక్కిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తీన్మార్ టీమ్ను టార్గెట్ చేశారు. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడంపై పలువురు బహుజనులు మల్లన్నపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో మల్లన్న టీమ్లో పనిచేస్తున్న బహుజన వర్గాలు మల్లన్నను వ్యతిరేకిస్తున్నారని మీరంతా మా పార్టీలో చేరండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లొచ్చిన మల్లన్న.. బీజేపీలో చేరడంతో రాష్ట్రంలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. బహుజన వాదంతో ముందుకొచ్చిన తీన్మార్ మల్లన్న బీజేపీ చేరటాన్ని ఆయన అనుచరులు జీర్జించుకోలేక పోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే అజెండాగా ముందుకు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తీన్మార్ మల్లన్న టార్గెట్గా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.
ఎన్నికల సమయంలో గుర్తురాని పవన్ ఇప్పుడు గుర్తుకొచ్చాడా ?