రోజా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యర్ధులపై తనదైన మాటల తూటాలు పేల్చే రోజా ఇప్పుడు వైసీపీ నేతలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2019లో నగరిలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు జగన్ క్యాబినెట్లో మంత్రి పదవీ దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే క్యాస్ట్ ఈక్వేషన్లలో భాగంగా రోజాకు మంత్రి పదవి మిస్ అయింది.
దాంతో రోజా కాస్త నిరాశ చెందడంతో ఆమెకు ఏపీఐఐసీ పదవీని సీఎం జగన్ కట్టబెట్టారు. దాంతో రోజా తనకు కేటాయించిన పదవీలో కొనసాగుతూ నియోజకవర్గ అభివృద్దికి పాటుపడుతున్నారు. రోజాకు సీఎం సపోర్టు ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధి వేగంగా చేస్తున్నారు. అయితే ఇద్దరు మంత్రులు నగరిలో కొద్దిరోజులుగా తనకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు తనదైన శైలిలో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. తనకు సమాచారం లేకుండా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నగరిలో పర్యటిస్తుండటంపై రోజా ఫైరవుతున్నారు.
తనకు తెలియకుండా మంత్రులు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైన సరే తన నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తోందట రోజా. ప్రధానంగా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డిని ఉద్దేశించి ఆమె కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. రోజా వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రులను జగన్ పిలిచి మాట్లాతారా? లేదా రోజాకే సర్దిచెబుతారా? అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబును నమ్మలేం.. ఆలోచనలో గవర్నర్ ?
టీడీపీకి గట్టి దెబ్బ.. వైసీపీలోకి గంటా.. జగన్ గ్రీన్ సిగ్నల్ ?