- Advertisement -
జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జీ మాకినీడి శేషుకుమారి వైసీపీ గూటికి చేరారు. గుంటూరు తాడేపల్లి కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, పిఠాపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత తదితరులు ఉన్నారు.
2019 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు శేషుకుమారి. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పవన్ పిఠాపురం రానుండగా ఇంతలోనే షాక్ తగిలింది.
ఇక పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.