- Advertisement -
ఆంధ్రప్రదేశ్లో భాజాపా అపరేషన్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. వచ్చె ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా టీడీపీలో ఉన్న నాయకులమీద దృష్టి సారించింది. తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకున్నారు.
ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు భాజాపాలో చేరిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరంలో ఈరోజు జరిగిన బహిరంగ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.