Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని

- Advertisement -

రోజా ఈ పేరుకి అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రీ లోను ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి కాలం నుండి ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి మైలేజ్ ని దక్కించుకుంటుంది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రస్తుతం వైసీపీ పార్టీ లో పోటి చేసి జగన్ కి అండగా ఉంటూ నగిరి ఎమ్మెల్యే గా వ్యవహరిస్తుంది. అయితే ఇమెకు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది. ఎప్పుడు ఎక్కడ సభలు నిర్వహించిన, ప్రెస్ మీట్స్ పెట్టిన కూడా రోజా అక్కడ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది

అయితే తాజాగా రోజా పిచ్చి చేష్టలపై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు మండిపడ్డారు. ‘రోజా నీ గురించి నాకు అంతా తెలుసు దాన్ని ఎక్కడ బయటపెట్టలో నాకు తెలుసు అప్పుడే బయటపెడుతా అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. రోజా… నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ సంగతి మొత్తం నాకు తెలుసు. మిగిలిన వాళ్లతో పెట్టుకున్నట్టు నాతో పెట్టుకోవద్దు” అంటూ హెచ్చరించారు.

మాచవరం మండలంలో జరిగిన దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే… చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పల్నాడు ప్రాంతాన్ని ఎన్నడూ లేనంతగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే… ఓర్వలేక వైసీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -