Saturday, May 18, 2024
- Advertisement -

జ‌గ‌న్‌, రేవంత్‌, టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌పై ప‌య్యావుల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

- Advertisement -

గ‌త రోజులుగా టీ టీడీపీలో రాజ‌కీయ గంద‌ర‌గోలం కొన‌సాగుతోంది. ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌పార్టీలోకి జంప్ అవుతున్నార‌న్న వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఏపీ మంత్రుల‌పైన రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌న‌ల‌పై తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ స్పందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని పయ్యావుల కేశవ్ ఆవదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తో తనకు సంబంధాలను అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. గత పాతికేళ్లలో పార్టీకి నష్టం కలిగించే ఏ ఒక్క పనిని కూడా తాను చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డికి తమ అధినేత చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. గత ఆరు నెలలుగా రేవంత్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని… దానికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని చెప్పారు.

టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితతో వ్యాపారం కోసం రేవంత్ రెడ్డి కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ తో కూడా రేవంత్ కు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను కేవలం మర్యాదపూర్వకంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశానని… ఈ అంశాన్ని అనవసరంగా రాద్ధాంతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబును రేవంత్ కలిసిన తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరే విషయంపై తాను ఇప్పడు ఏమీ మాట్లాడనని అన్నారు. పార్టీ కంటే వ్యక్తిగత అజెండానే రేవంత్ కు ముఖ్యమని మండిపడ్డారు. తనకు, మంత్రి యనమలకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. నాకు, పరిటాల కుటుంబానికి తెలంగాణలో ఎలాంటి వ్యాపారాలు లేదని చెప్పారు. టీటీడీపీలో కొన సాగుతున్న గంద‌ర‌గోళానికి ఎప్పుడు తెర‌ప‌డుతుందో .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -