Saturday, May 4, 2024
- Advertisement -

సినిమావాళ్ల‌కు మాయ‌దారి రోగం దాప‌రించిందా…టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌

- Advertisement -

టాలీవుడ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. హోదా ఉద్యమానికి తెలుగు కళాకారులు ఎందుకు మద్దతివ్వరని ప్రశ్నించారు. మీరంతా హాలీవుడ్ స్థాయి నటులేం కాదన్నారు. వీరంతా హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే పనికొస్తారని… ఏజ్ బార్ అయిన నటులకు కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు.

ఎవరికైనా అవార్డు రాకపోతే రచ్చ రచ్చ చేస్తారని… భూమి, ఆకాశాలు బద్దలైనట్టు వ్యవహరిస్తారని… ఇంటర్వ్యూలపై ఇంటర్వ్యూలు ఇస్తారని… ఇక్కడ మా ఆంధ్ర ప్రజలకు రివార్డులు రావడం లేదయ్యా… నిధులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామయ్యా… మీ కళ్లకు కనబడటం లేదా? ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం అడ్డొస్తోందని.. లేకపోతే ఇంకా కఠినంగా మాట్లాడేవాడినని అన్నారు.

ఏజీ బార్ అయిన హీరోలూ… మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీది హాలీవుడ్ స్థాయి కాదని… హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే మీరు పనికొస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడకుంటే… ఏపీ ప్రజలు మిమ్మల్ని వెలివేసేస్తారంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా మౌనం వీడాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -