Saturday, May 11, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లా టీడీపీలో చిచ్చు ర‌గిల్చిన ఎంపీ ఎస్పీవై రెడ్డి

- Advertisement -

క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాల్లో నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌ల‌య్యింది. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో సీట్ల విష‌యంలో గ్రూపు త‌గాదాలు భ‌గ్గుమంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా రాజకీయంపై టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్ పై తాను పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. బాబు చేయించిన స‌ర్వేల్లో ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. త‌న అల్లుడుకూడా నంద్యాల అసెంబ్లీ టికెట్ కూడా వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

నంద్యాల అసెంబ్లీ సీటును తన అల్లుడికి ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి చంద్రబాబును కోరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతంలో ఎస్పీవై రెడ్డికి నంద్యాల అసెంబ్లీ సీటును, బుట్టా రేణుకకు పార్లమెంటు స్థానం ఇస్తామని చిన‌బాబు నారా లోకేశ్ వారికి మామి ఇచ్చారు. ఎస్పీవైరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత టీజీ వెంకటేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్పీవైరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత టీజీ వెంకటేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టికెట్లను ఎవ‌రికి ఇవ్వాలో ఇవ్వ‌కూడ‌దో బాబు నిర్ణ‌యిస్తారు త‌ప్ప మీరు కాద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -