Tuesday, May 14, 2024
- Advertisement -

కొత్త నాట‌కానికి తెర‌లేపిన ప‌చ్చ పార్టీ..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ వికృత చేష్ట‌లు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ అభ్య‌ర్తి బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఓటు వేయ‌క‌పోతె రేష‌న్‌, ఫిచ‌న్‌లు క‌ట్ చేస్తామ‌ని బెదిరించిన సంగ‌తి తెలిసందే. ఇప్పుడు తాజాగా మ‌రో కొత్త నాట కానికి తెర‌లేపింది. పార్టీ నాయ‌కుల‌ను చూస్తూనె అమ‌డ‌దూరం ప‌రిగిఎడుతున్నారు వైసీపీ మ‌ద్ద‌తు దారులు.

ఉప ఎన్నిక ప్ర‌చారం చివరి ద‌శ‌కు చేరుకోవ‌డంతో అధికార పార్టీ బ‌రితెగింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది. ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసి తాజాగా మ‌రో నాట‌కానికి తెర‌లేపింది. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు క‌నిపిస్తే చాలు వారికి బలవంతంగా కండువాలు కప్పి తమ పార్టీలో చేరినట్టు చూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. శనివారం మంత్రులు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు టీడీపీ కండువాలు కప్పి అభాసుపాలయ్యారు.

గంగుల ప్ర‌తాప్ రెడ్డి టీడీపీలో చేరిన సంగ‌తి తెల‌సిందే. ఆయ‌న బంధువు కావ‌డంతో ప్ర‌తాప్‌రెడ్డి ఇంటికి వెల్లామ‌ని ..దాంతో తాము టీడీపీలో చేరిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని అధికార పార్టీ తీరుపై ప్రసాద్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము టీడీపీలో చేరినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులగానే కొనసాగుతామని చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నేతలు లేని బంధుత్వాన్ని ఆపాదిస్తూ.. బలవంతంగా కండువాలు కప్పుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఎన్ని కుట్ర‌లు చేసినా వైసీపీ అభ్య‌ర్తి శిల్పా మోహ‌న్‌రెడ్డిదే విజ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -