Saturday, May 18, 2024
- Advertisement -

బాబుకు బిగ్ షాక్‌…. సైకిల్ దిగి కాషాయం గూటికి చేరిన‌ సీనియ‌ర్ నేత‌లు

- Advertisement -

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర‌ప‌రాజ‌యం టీడీపీనీ వెంటాడుతోంది. భాజాపాలో చేరిక వ‌ల‌సులు ఆగ‌డంలేదు. బాబు, పార్టీ భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం లేక సీనియ‌ర్ నాయ‌కులు, ముఖ్య నాయ‌కులు సైకిల్ దింగుతున్నారు. ప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడారు. అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.

గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్‌ నేతగా పేరొందిన సాంబశివరావు.. గతకొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.ఈయ‌న భాజాపాలో చేరేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇద‌లా ఉంటె ప్ర‌కాశం జిల్లాలోకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువాను ఆయన కప్పుకున్నారు. హరిబాబును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన నడ్డా, ఆయనకు అభినందనలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -