జనసేన అధినేత పవన్ తెలంగాణాలో రాజకీయ యాత్రను ప్రారంభించనున్నారు.కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజ అనంతరం సాయంత్రం తన యాత్ర గురించి వివరాలను ప్రకటించనున్నారు. రాజకీయాత్ర ప్రారంభించకముందే పవన్పై ఇతర రాజకీయ పార్టీలనుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. తెలంగానా భాజాపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ విమర్శలు ఎక్కుపెట్టారు.
దక్షిణ భారతదేశంలో పెరియార్ స్ఫూర్తితో వస్తున్నానని చెప్తున్న పవన్ కల్యాణ్వి అవకాశవాద రాజకీయాలు అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. ఆయన ప్రాంతీయవాదంతో పబ్బం గడపాలని చూస్తున్నారని ధ్జమెత్తారు. జనసేన రాజకీయ పార్టీనా? బ్రోకరేజ్ సంస్థానా? అని ప్రశ్నించారు. ‘జనసేనకు కార్యవర్గం లేదు. లోగో, జెండా ఉన్నాయి కానీ డైరెక్షన్ లేదన్నారు.
జనసేన సినిమా విడుదల కాకముందే ఫెయిల్ అయింది’ అని విమర్శించారు. పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, కేసీఆర్ కుటుంబంపై ఆయన అనేక వాక్యాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ను పవన్ పొగడడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ పార్టీ బీ టీం అని, అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీల్చడానికి టీఆర్ఎస్ ప్రయోగిస్తున్న అస్త్రంగా తాము భావిస్తున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ది భజన పార్టీ అని, ఏపీలో చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్ పొగడడం అంటేనే.. ప్యాకేజీల పార్టీగా కనబడుతుందని విమర్శించారు. జనసేనలో కార్యకర్త లేరని, కేవలం అభిమానులతో పవన్ హడావిడి చేస్తున్నారని అన్నారు. ఏపీలో పెరుగన్నం తిని, తెలంగాణలో బిర్యానీ తినడం కాదు రాజకీయం అంటే అని అన్నారు.