Saturday, May 11, 2024
- Advertisement -

చంద్రబాబుకు బెదిరింపులా.. నో ఛాన్స్ !

- Advertisement -

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరులో నిర్వహించిన సభలో మాట్లాడుతూ తనను, లోకేశ్ ను చంపుతామంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల బాబాయ్ ని చంపినట్లుగా తమను కూడా చంపుతారేమో అంటూ పరోక్షంగా వైఎస్ జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. తనకు ఇదే చివరి అవకాశామని ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు చంద్రబాబు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. .

కటికి కాలు చాచిన చంద్రబాబును చంపల్సిన అవసరం లేదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ 150కి పైగా హత్యలు జరిగాయని, పరిటాల రవి బ్రతికి ఉన్నప్పుడూ ఎన్ని హత్యలు జరిగాయో అందరికి తెలుసునని ప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంచితే చంద్రబాబు ఈ మద్య చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపుతున్నాయి. ఆ మద్య కర్నూల్ పర్యటనలో భాగంగా ఇదే తన చివరి ఎన్నిక అంటూ పోలిటికల్ హిట్ పెంచిన బాబు.

ఇప్పుడు పశ్చిమ గోదావరి పర్యటనలో భాగంగా తనను తన కుమారుడిని వైసీపీ నేతలు చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి మరో సంచలనానికి తెర తీశారు. ఇక తన ప్రసంగాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి రాజేస్తున్నారు చంద్రబాబు. ఇక వచ్చే ఎన్నికలు టీడీపీ పార్టీకి డూ ఆర్ డై ఎన్నికలు కావడంతో ఇప్పటి నుంచే పోలిటికల్ హిట్ పెంచుతూ ప్రజల అటెంక్షన్ టీడీపీ వైపు ఉండేలా చూసుకుంటున్నారు చంద్రబాబు. కాగా రాజకీయాల్లో అపార చాణక్యుడిగా పేరున్న బాబు రాజకీయ వ్యూహంలో భాగంగానే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నా చర్చ. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారనేది వాస్తవం.

ఇవి కూడా చదవండి

పొత్తులను నమ్ముకోలేదు: సి‌ఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

“బటన్ నొక్కుడు “.. ఇదేం పాలనరయ్యా !

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -