- Advertisement -
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం దిశలో కొనసాగుతోంది. ఆరో రౌండ్ నుంచి సోలిపేట సుజాత లీడ్లో ఉన్నారు. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 182 ఓట్ల ఆధిక్యం సాధించారు. తొలి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యతను సాధించగా… ఆ తర్వాత ఆరో రౌండులో టీఆర్ఎస్ పుంజుకుంది. ఏడో రౌండులో సైతం ఆధిక్యతను ప్రదర్శించింది.
మిరుదొడ్డి మండలంలోని ఓటర్లంతా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. ఏడు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీకి 20,277 ఓట్లు పోలవగా, బీజేపీకి 22,762 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 4003 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 2718, బీజేపీకి 2,536, కాంగ్రెస్కు 749 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మహేశ్ త్యాగం మరువలేనిది.. ప్రముఖుల నివాళి!
ప్రజల కష్టాలు దగ్గరుండి చూశారు.. ఆయన ఓ చరిత్ర : మోపిదేవి