Sunday, May 5, 2024
- Advertisement -

టీఆర్ఎష్‌కు బిగ్ షాక్‌…టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్‌లోకి…

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకీ షాక్ ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. పార్టీలో టికెట్ రానివారు రెబ‌ల్‌గా పోటీచేస్తుంటే, మ‌రి కొంత మంది కాంగ్రెస్ పార్టీలోకి వెల్లిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఎమ్మెల్సీ, టీఆర్ఎస్‌ నేత రాములు నాయక్ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు క‌దుపుతున్నాడు.మెదక్ జిల్లా నారాయణఖేడ్ టిక్కెట్టును రాములు నాయక్ ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే నారాయణఖేడ్ టిక్కెట్టును ఖరారు చేసిన నేపథ్యంలో రాములునాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం.

ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం హైద్రాబాద్‌ గోల్కొండ హోటల్ లో జరిగింది.ఈ సమావేశం జరిగే సమయంలోనే రాములునాయక్ ఈ హోటల్‌ వద్దకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాతో పాటు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాములు నాయక్ సమావేశమయ్యారు.

ఖమ్మం జిల్లా ఇల్లెందు నుండి పోటీ చేయాలని రాములు నాయక్‌ను కాంగ్రెస్ పార్టీ కోరినట్టు సమాచారం. ఇల్లెందు లేకపోతే భద్రాచలం అసెంబ్లీ టిక్కెట్టును ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించిందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -