Friday, May 10, 2024
- Advertisement -

సీఎం చంద్ర‌బాబుపై బాల్క సుమ‌న్ తిట్ల ప‌రాణం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం తిష్ట వేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం దొంగల ముఠాను తెలంగాణకు పంపాడని బూతు పురాణం మొద‌లు పెట్టారు.

ఏపీలో సంపాదించిన క్ర‌మ సంపాద‌నంతా తెలంగాణలో ఖర్చుపెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. వేరే రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ పోలీసులు తెలంగాణలో ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. డీజీపీ, గవర్నర్‌ ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

లేదంటే తామే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతామని తెలిపారు. చంద్రబాబు చీకటి రాజకీయాలు మానుకోవాలని బాల్క సుమన్‌ సూచించారు. చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.

చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా సరిపోదని వ్యాఖ్యానించారు. ఆంధ్రా ప్రజల సొమ్ముతో వేతనాలు తీసుకుంటున్న పోలీసులు వారి కోసం పనిచేస్తే బాగుంటుందని చురకలు అంటించారు. ఏపీ పోలీసులు పచ్చ పార్టీ ఏజెంట్లుగా మారారని, ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని బాల్క సుమన్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -