టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ సినియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్ర వాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, వదిన ను చంపి రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని ఉమకి విలువల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. చంద్రబాబు డ్రామా కంపెనీ నడుపుతున్నారని, అందులో కుక్కలు, పందులు వంటి వివిధ రకాల జంతువులున్నాయని ఎద్దేవా చేశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చకు వచ్చే దమ్ములేక ఉమ డ్రామాలాడుతున్నారని, ఆయన ఒక రకమైన వ్యక్తి అని ఎద్దేవా చేశాడు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని, చర్చకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నాం అంటూ ఛాలెంజ్ చేశారు. చర్చ పెడదామని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని చెప్పలేదని వంశీ వివరించారు.తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ అని, అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం, చంద్రబాబు తెలుగుదేశం వేరు అంటూ వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో తనకు తెలుసునని, ఉమా ఒక లోఫర్ అని మండిపడ్డారు.
2014కి ముందు చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్ని హామిలిచ్చారు? ఎన్ని నేరవేర్చారని నిలదీశారు.ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, దేవినేనిలకు ఆయన విగ్రహాన్ని ముట్టుకునే అర్హతే లేదని తేల్చి చెప్పారు. అసలు దేవినేని సిగ్గు లేని మనిషని, సీఎం వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి ఆయనకెక్కడిదని దుయ్యబట్టారు. బహిరంగచర్చకు రమ్మంటే గొల్లపూడిలో నిరసన అంటూ డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నామని, నీ ఇంటికి రమ్మంటే అక్కడే చర్చిద్దాం.. లేదంటే కొడాలి నాని ఇంటి దగ్గర చర్చకు రమ్మని సవాలు విసిరారు.
అనసూయకు మరో చాన్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
హీరో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రారంభం!