ఇటీవల ఏపిలో వరుసగా ఆలయాల విధ్వంసాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేసుకుంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై తనదైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డంగా ఉన్నాయని విజయవాడలో 39 గుళ్లను నేలమట్టం చేశాడు.
ఇప్పుడు అధికారం కోసం ఆలయాలను కూల్చి అరాచకం సృష్టించాలని కుట్రలు చేస్తున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీని టెంపుల్స్ డిమాలిషన్ పార్టీ (టీడీపీ)గా దిగజార్చాడు.
అన్ని ప్రాంతాల అభివృద్ధిపై సీఎం జగన్ గారి ప్రత్యేక శ్రద్ధ. భీమిలి నుంచి భోగాపురం వరకూ తీరంలో ఆరు లైన్ల బీచ్ రోడ్డు. గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం. మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు… వెయ్యికోట్లతో డీపీఆర్ ఆమోదించేందుకు చర్యలు’ చేపట్టారని.. ఏపిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఎంతో చక్కగా నడుస్తుందని అన్నారు.
దమ్ము, ధైర్యం లేనోడు.. భార్గవ్రామ్పై ఫైర్!
సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?