టీడీపీ ఘోర ఓటమి పాలై దాదాపు సంవత్సరంన్నర పూర్తయిన ఆ దెబ్బకు ఇంకా కోలుకోలేకపోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదేమో అందుకే బయట ఎక్కువ కనిపిస్తలేదు అనిపిస్తుంది.. అయితే చంద్రబాబు ఒక్కడే కాదు ఇతర టీడీపీ నేతలు కూడా ఎవరు ఎక్కువగా టీడీపీ కార్యకలాపాల్లో కనిపించడంలేదు.. కనిపించిన ఒక్కరిద్దరు జూమ్ యాప్ లో చంద్రబాబు తో మాట్లాడి చేతులు దులిపేసుకుంటున్నారు..
వాస్తవానికి టీడీపీ గెలిచ్చిన 23 సభ్యులు మంచి బలమైన నాయకులే.. అయినా సరే వారిలో ఎవరూ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే పరిస్థితి కనపడటం లేదు. పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వంటి బలమైన నాయకులూ కూడా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలని ఎండగట్టిన పరిస్థితి దాదాపుగా లేదని చెప్పాలి. అసలు జగన్ కి ఎదురు చెప్పే సత్తువ వారికి ఎందుకు లేదో అర్థం కావట్లేదు..
అయితే ఇప్పటికే జగన్ ని తీవ్రం గా విమర్శించిన వారు జైలు పాలు అవడంతో తమ పరిస్థితి అలా అవుతుందేమోనని వారు భయపడుతున్నట్లు ఉన్నారు అని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నాయి.. నాయకుడనే వాడు ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరిగితే మినహా లాభం లేదు. టీడీపీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ప్రజల్లో ఉంటే మాత్రమే టీడీపీ ని గుర్తించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కానీ ఇలాంటి సమయంలో కూడా చాలా మంది టీడీపీ నాయకులు మీడియా ముందు కానీ, అసలు ప్రజల్లోకి కానీ వచ్చే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వారికి ఎలా సర్ది చెప్పి ప్రజల్లోకి తీసుకొస్తారో చూడాలి..