ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. అధికార , ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధంతో సభ దద్దరిల్లింది. రాష్టరంలో కరువుపై చర్చ కొనసాగింది. దీనిలో భాగంగా రైతులకు సున్నా వడ్డీకె రుణాల విషయంలో బాబు, జగన్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీని టార్గెట్ చేసిన అధికార వైసీపీ… 2014-19 మధ్యకాలంలో సున్నా వడ్డీకి ఎంత మేర రుణాలు మంజూరు చేశారని విపక్షాన్ని ప్రశ్నించింది
అంతే కాదు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై చంద్రబాబుకు సవాల్ విసిరారు. 2014 నుంచి 2019 దాకా రైతులకు సున్నా వడ్డీ కింద ఎంత రుణాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.. ఎస్.. చెప్పండి. నోరు తెరిస్తే అబద్ధాలే. అధ్యక్షా.. కావాలంటే నేు రికార్డులు తెప్పిస్తా. ఆ రికార్డులు తెచ్చి చూపించిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా? అని అడగండి అధ్యక్షా. రెడీనా.. నేను ఇప్పుడే అసెంబ్లీలోకి రికార్డులు తెప్పిస్తా’ అని మండిపడ్డారు.
ఇదే అంశంపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ చర్చలో పాల్గొని తనదైన స్టయిల్లో పోకిరి సినిమాలో పంచ్ డైలాగ్ పేల్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారని… కానీ అడిగిన ప్రశ్నకు, చేసిన సవాల్ను మాత్రం స్వీకరించడం లేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అసవరం లేదని… బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమని టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. విపక్షానికి బుల్లెట్ దిగింది కాబట్టే సబ్జెక్ట్ నుంచి వాళ్లు పక్కకు పోతున్నారని ఆయన విమర్శించారు.