Wednesday, May 15, 2024
- Advertisement -

సుజనాకు కౌంటర్ ఇచ్చిన విజయసాయి

- Advertisement -

ఏపీలో ట్విట్టర్ రాజకీయం మంచి జోరుమీదుంది. చీమ చిటుక్క మంటే చాలు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలోకి ఎక్కుతున్నారు. రాజధాని మార్పులపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో వైసీపీ,టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఈ రాజధాని కంపులోకి భాజాపా ఎంపీ సుజనాచౌదరి ఎంట్రీ ఇచ్చారు. అమరావతిలో పర్యటించిన ఆయన జగన్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.రాజధానిలో ఆయనకు భూములు ఉన్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేయగా.. ఎంపీ కూడా స్పందించారు. తనకు సెంటు భూమి ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు.

టీడీపీ తరుపున రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యేందకు బాబుకు ఎంత కప్పంకట్టారో అందరికి తెలుసునన్నారు.అలాంటి చరిత్ర ఉన్న మీరు ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు. అయినా, మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే కదా సుజనా చౌదరి గారూ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

రాజధాని ప్రాంతంలో బినామి పేర్లపైన వందల ఎకరాల భూములు కొన్న వారి చిట్టా త్వరలోనే బయటకొస్తుంది. దొంగలెవరో దొరలెవరో తెలుస్తుంది. బ్యాంకు ఫ్రాడ్ కేసుల్లో ఉన్నవాళ్లు ఆస్తులు అటాచ్ కాకుండా బినామీ పేర్లు పెడతారన్నది జగమెరిగిన సత్యం. పార్టీ మారినంత మాత్రాన పునీతులైపోరు సుజనా చౌదరి గారూ?’అంటూ చురకలంటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -