Saturday, May 18, 2024
- Advertisement -

ప‌సుపు-కుంకుమ తీసుకొని బాబుకు మ‌హిళ‌లు ఉప్పు, కారం పూశారు…రోజా

- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. అసెంబ్లీల్లో ఈరోజు ప్రవేశేపెట్టిన విదేశీ మద్య నియంత్రణ బిల్లుపై ఆమె మాట్లాడారు. బాబు హ‌యాంలో అడుగ‌డుగునా బెల్ట్ షాలు వెలిశాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. బెల్టు షాపులను రద్దు చేస్తామన్న హామీతో నాడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తాను చేసిన సంతకాన్ని తానే అమలు చేసుకోలేకపోయారని విమ‌ర్శించారు.బాబు పాలనలో వీధికో బెల్టు షాపు ఉండేదని, నారా వారి పాలన కాదు సారా వారి పాలన అన్నట్టు ఆయన పాలించారని ఎద్దేవా చేశారు.

బాబు మ‌ద్యం పాల‌సీ వ‌ల్లే రాష్ట్రంలో మ‌హిళ‌లు, చిన్నారుల‌పై నేరాలు పెరిగిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌సుపు-కుంకుమ‌పేరుతో నాట‌కాలాడార‌ని కాని …అక్కా చెల్లెమ్మ‌లు మాత్రం బాబు క‌ళ్ల‌లో ఉప్పు, కారం కొట్టార‌ని సెటైర్లు వేశారు. విశాఖ బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని చూస్తే, సంస్కృతిని నాశనం చేయొద్దని తాము ఎదురు తిరిగామని గుర్తుచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -