చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షంలో ఉన్నలు ఫీల్ అవుతున్నారు.. అందుకే తాను ముఖ్యమంత్రి పదవి లో ఉన్నానన్న భ్రమలో బతుకుతూ ఉన్నాడు.. మొదటినుంచి జగన్ ను ఇంకా ప్రతిపక్ష నేతగా చూస్తూ ముఖ్యమంత్రి అని చూడకుండా ఓ పార్టీ సాధారణ కార్యకర్తలా విమర్శిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి విషయంలో జగన్ చంద్రబాబు పెట్టిన ఇబ్బంది అందరికి తెలిసిందే.. మరోవైపు తన మనుషుల తో ప్రభుత్వం పై కేసులు వేసి పైశాచిక ఆనందం పొందారు.. తన అనుకూల మీడియాలో జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా జగన్ పై మెచ్చే వేసే ప్రయత్నం చేశారు..
కానీ జగన్ కు ప్రజల అండ ఉంది. వారి అండదండ ఉన్నన్నాళ్ళు ఇలాంటి విమర్శలు ఎన్ని ఉన్నా ఆయనకు ఎలాంటి ఢోకా లేదు.. ప్రజల్లో సంక్షేమ పథకాలు సరిగ్గా వెళ్తున్నాయో లేదో చూసుకుని వారికి మరింత దగ్గరయ్యాడు జగన్.. అయితే కొన్ని విషయాల్లో చంద్రబాబు చేసే ఈ అతి వల్లే జగన్ ప్రజల్లోకి మొండిగా వెళ్లి వారికి న్యాయం చేశారనే వాదన వినిపిస్తుంది.. ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు కార్యక్రమాలకు అడ్డుపుల్లలు వేస్తూనే ఉంది.
అయితే ఆ అడ్డుపుల్లలవల్లే జగన్ ఇంత సమర్ధవంతంగా పనిచేశారు..“బాబు అడ్డు పడకపోతే.. మాకు జగన్ ఎప్పుడు ఇచ్చేవాడని“ అనే టాక్ వచ్చేలా చేసింది.మొత్తంగా చూస్తే.. ప్రతిపక్షంగా బాబు ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టాలని చూస్తున్నా.. సరైన విధానం లేకుండా సాగుతున్న ఈ వ్యతిరేకత.. ఆఖరుకు ఆయనకే నష్టం కలిగించేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క జగన్ కు ఈ విషయంలో ఎలాంటి మరకలూ అంటకపోవడం గమనార్హం. మరి ఇప్పటికైనా బాబు మారతారో లేదో చూడాలి.