Thursday, May 16, 2024
- Advertisement -

వైసీపీలోకి గంటా.. వెంటనే ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్..!

- Advertisement -

అధికార వైసీపీలోకి టీడీపీ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటికే ఇద్దరు టీడీపీ నేతలు వైసీపీకి సపోర్ట్ చేశారు. తాజాగా గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అధికారం వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే సీఎం జగన్ ఈ చేరికపై ట్విస్ట్ ఇచ్చినట్టు సమాచారం. పార్టీలోకి గంటను కాకుండా ఆయన కుమారుడి రవితేజను వైసీపీలోకి చేర్చుకోబోతున్నట్లు తెలిసింది. తన తండ్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలోనే శనివారం రవితేజ వైసీపీలో చేరనున్నారు.

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో రవితేజకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించానున్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాల గిరి, వల్లభనేని వంశీ నేరుగా పార్టీలో చేర్చుకున్న సీఎం జగన్ తర్వాత రూటు మార్చారు. ఎమ్మెల్యేలను కాకుండా వారి కుమారులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల కుమారులకు, కుటుంబాలకు సీఎం జగన్ కండువాను కప్పనున్నారు.

వైసీపీలో చేరలనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని తొలిత జగన్ ఆదేశించారు. కానీ ఇప్పుడు వారి కుమారులను, కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు సైతం నేరుగా పార్టీలో చేర్చుకోకుండా ఆయన కుమారుడిని సీఎం జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకునే ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.

డిక్లరేషన్ పై చంద్రబాబు ఎందుకంత పోరాటం చేస్తున్నారు.. అవి బయటపడతాయనేనా.. ..?

ఛీ. పొమ్మన్న చంద్రబాబు బీజేపీ చెంతకే వెళ్తున్నాడంటే.?

వారి కొసం జగన్ వ్యూహం ఎంటి..?

చంద్రబాబు కు ఇప్పుడు వాళ్ళే దిక్కా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -